తెలుగు భాష కు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయించటం హర్షణీయం.
సుమారు 25 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ద్వారా మనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావటం అందరికీ తెలిసిన విషయమే. ఏనాడో తమిళులు సాధించిన దాన్ని ఇన్నాళ్ళకైనా మనం పొందటం ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆ మహనీయుడ్ని తల్చుకోవటం ఎంతైనా సందర్భోచితం.
మన రాజకీయ నాయకులు తమ అపార రాజకీయ చాతుర్యాన్ని వుపయోగించి ఈ సందర్భంగా వచ్చే 100 కోట్ల నిధుల్ని దారి మల్లించకుండా వుంటే చాలు మన భాష అభివ్రుద్ధి సాధిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం అవసరంలేదు.
దేశం లో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష అయిన మన తెలుగు భాషని ఇకనైనా కాపాడుకుందాం.
జై తెలుగు తల్లీ
Saturday, November 1, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
itz a good beginning. keep it up
Post a Comment